loading

0%

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.

 గురువారం రాత్రి ఆస్వస్థతకు గురైన ఆయనను.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు

 ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

 ఇప్పటికే ఆస్పత్రి వద్దకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. 

2024 ఏప్రిల్‌లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయన సుదీర్ఘ పార్లమెంటరీ జీవితాన్ని ప్రశంసించారు. అలాగే పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న 1991 సంవత్సరం నుంచి 1996 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత అంటే 1998 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ముఖ్యంగా 2004వ సంవత్సరం మే 22వ తేదీన మన్మోహన్ సింగ్.. ప్రధాన మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.