loading
0%30,Apr-2025
మాజీ రా చీఫ్ అలోక్ జోషి చైర్మన్ గా నియామకం.
కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు దేశ భద్రతా వ్యవహారాలపై సలహాలు, సిఫార్సులు అందించే ఉన్నత స్థాయి సంస్థగా పనిచేయనుంది. ఈ బోర్డుకు మాజీ రా (R&AW) చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది.
ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు. సైనిక సేవల నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు. వీరి సైనిక నైపుణ్యం, వ్యూహాత్మక దృష్టి బోర్డు నిర్ణయాలకు బలాన్ని చేకూర్చనుంది.
Categories