loading
0%24,Apr-2025
కర్నూలు హాస్పిటల్ : హజ్ యాత్రకు లందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలు వేస్తా మని డీఎంహెచవో డాక్టర్ పి.శాంతికళ తెలిపారు.
హజ్ యాత్రకు లందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలు వేస్తా మని డీఎంహెచవో డాక్టర్ పి.శాంతికళ తెలిపారు. నగరంలోని కింగ్మార్కెట్ దగ్గర ఉన్న ఈడెన గార్డెన కమ్యూనిటీ హాలులో మంగళవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హజ్ యాత్రికు లకు వ్యాక్సినేషన శిబి రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచవో మాట్లాడుతూ యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సిన వేసి సర్టిఫికెట్ను అందజే స్తామన్నారు. హజ్ యాత్రికులందరూ ఎలాంటి అపోహలు లేకుండా ఓరల్ పోలియో, మేనింన్లోకోకల్, ఇనప్లూ ఎంజా వ్యాక్సిన వేయించుకుని సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని డీఎంహెచవో సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వై.నాగప్ర సాద్, డిస్ర్టిక్ట్ ఎపిడమాలజిస్టు వేణుగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకుడు శివకుమార్, స్టాఫ్ నర్సులు, ఏఎనఎంలు, ఆశా వర్కుర్లు పాల్గొన్నారు.